న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ఫిరోజ్ షా కోట్లాలో భారత్ తో జరుగుతున్న చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో లంకేయులు నాలుగో వికెట్ ను కోల్పోయారు. 31/3 ఓవర్నైట్ స్కోరుతో ఐదో రోజు ఆటను ఆరంభించిన శ్రీలంక జట్టును బర్త్డే బాయ్ రవీంద్ర జడేజా దెబ్బ తీశాడు. సినీయర్ బ్యాట్స్మెన్ ఏంజెలో మాథ్యూస్ (1)తో పెవిలియన్కు చేర్చాడు. మాథ్యూస్ బ్యాట్కు తగిలిన బంతి స్లిప్ వైపు దూసుకురాగా రహానే అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం ధనంజయ డిసిల్వా (43), చండిమాల్ (2) క్రీజులో ఉన్నారు.