న్యూఢిల్లీ, డిసెంబర్ 05 : భారత్- శ్రీలంకల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు పట్టు బిగించింది. 356/9 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 373 పరుగులు వద్ద ముగిసింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు శిఖర్ ధావన్(67), విరాట్ (50), రోహిత్ శర్మ(50) ఆర్ధ శతకాలు చేసి రాణించడంతో, కోహ్లీసేన శ్రీలంక ముందు 410 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన లంకేయులు, ఈ రోజు ఆట ముగిసే సమయానికి 31 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతున్నారు. సదీరా సమరవిక్రమా(5), కరుణరత్నే(13), లక్మల్(0)లు వెంటవెంటనే పెవిలియన్ చేరి నిరాశపరిచారు. 379 పరుగులు వెనుకబడి ఉన్న లంక జట్టు చివరి రోజు సుదీర్ఘ పోరాటం చేస్తే తప్ప భారత్ విజయాన్ని అడ్డుకోలేదు. టీమిండియా బౌలర్లలో జడేజా రెండు వికెట్లు తీయగా, పేసర్ షమి ఒక వికెట్ దక్కించుకున్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ 536/7 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ 246/5 డిక్లేర్ శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 373 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 31/3