అమరావతి, డిసెంబర్ 05 : ఈ నెల 7న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విచ్చేయనున్నారు. ఏయూలో ఈ-క్లాస్ రూం కాంప్లెక్స్ భవనానికి, ఇంక్యుబేషన్ సెంటర్కు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రామ్నాథ్ కోవింద్ ఏపీలో పర్యటించనున్నారు. 7న మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అదేరోజు ఎయిర్ క్రాప్ట్ మ్యూజియంను ప్రారంభించనున్నారు. 8వ తేదీన ఉదయం 8 గంటలకు ఐఎన్ఎస్ పరేడ్ గ్రౌండ్లో కలర్స్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం తిరిగి పయనం అవుతారు.