న్యూఢిల్లీ, డిసెంబర్ 5: పెద్ద నోట్ల రద్దు తరువాత రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, కొత్త రూ . 500, 2000,రూపాయల నోట్లను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ నోట్లపై ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆర్బీఐ మరో కొత్త నోటు రూ.350 మార్కెట్లోకి విడుదల చేస్తుందని, త్వరలోనే రూ.2000 నోటును నిలుపుదల చేస్తుందంటూ వార్తలు గుప్పుమన్నాయి . దీనిపై స్పందించిన ఆర్బీఐ, ఈ వార్త నిజం కాదని తేల్చి చెప్పింది. అంతేకాదు మార్ఫింగ్ చేసి విడుదల చేస్తున్న ఇలాంటి వార్తలను నమ్మొద్దని సూచించింది.