న్యూఢిల్లీ, డిసెంబర్ 5: భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో లంకేయులు 373 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. ఓవర్ నైట్ స్కోర్ 131/3తో సోమవారం ఆట కొనసాగించిన శ్రీలంక తొలి సెషన్లో లంక సారధి చండిమల్, ఏంజెలో మాథ్యూస్, సెంచరీలతో దూసుకెళ్ళగా, 356 పరుగులు తీసి 9 వికెట్లను కోల్పోయారు. ఓవర్నైట్ స్కోరు 356/9తో నాలుగో రోజు, మంగళవారం ఆట ప్రారంభించిన పర్యాటక జట్టు 135.3 ఓవర్లకు 373 పరుగులకు చేసి మరో వికెట్ కోల్పోయారు. దీంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ప్రస్తుతం లంకపై భారత్ 163 పరుగుల ఆధిక్యంలో ఉంది.