ముంబాయి, డిసెంబర్ 04 : బాలీవుడ్ లో నటుడుగా, నిర్మాతగా ఒక వెలుగువెలిగిన శశి కపూర్, సోమవారం తుదిశ్వాస విడిచారు.1938 మార్చి 18 న నాటి కలకత్తా(కోల్కతా)లో జన్మించిన ఈయన పూర్తి పేరు బల్బీర్ రాజ్ పృధ్వీరాజ్ కపూర్. 1940 దశాబ్దిలోనే సంగ్రామ్ (1950), దనపాణి (1953) లాంటి వాణిజ్య చిత్రాల్లో బాల నటుడిగా తన ప్రస్థానంను ప్రారంభించారు. 1948లో వచ్చిన ‘ఆగ్’, 1951లో వచ్చిన ‘ఆవారా’ చిత్రాల్లో తన అన్న రాజ్కపూర్ చిన్నప్పటి పాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు.1961లో ‘ధర్మపుత్ర’ చిత్రం ద్వారా హీరోగా తన కెరీర్ను ప్రారంభించారు. తర్వాత చాలా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. చిత్ర పరిశ్రమకు శశికపూర్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2011లో ఆయనను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా శశికపూర్ అందుకున్నారు. ఆయన మృతికి బాలీవుడ్ చిత్ర ప్రముఖులు సంతాపం తెలియచేశారు.