అమరావతి, డిసెంబర్ 04 : దక్షిణకొరియా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐరిటెక్ కంపెనీ సీఈవో కిమ్ డెహోన్ను కలిశారు. ఈ సందర్భంగా సెన్సర్లు, డ్రోన్లు, ఐవోటీ, క్లౌడ్ లాంటి.. సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టామని ఆయనకు సీఎం చంద్రబాబు వివరించారు. దీంతో ఈనెల 10వ తేదీ అనంతరం ఏపీకి వస్తామని కిమ్ డెహోన్, చంద్రబాబుకు వెల్లడించారు.