ఆర్‌బీఐ, ఎస్‌బీఐకు సూచన...

SMTV Desk 2017-12-04 15:35:55  state bank of india, reserve bank of india,

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: వినియోగదారుల సమాచారానికి భద్రత కల్పించడంలో ఆర్‌బీఐ నిబంధనలను , ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ ఉల్ల౦ఘిస్తోందని బాత్రా అనే వ్యక్తి ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు నవంబర్‌ 28న లేఖ రాశారు. దీనికి స్పందించిన ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్‌బీఐకి సూచించింది. అసలు సమాచారం ఏవిధంగా లిక్ అవుతందని పరీక్షించగా సురక్షితం కాని ఎన్వలప్‌లను ఉపయోగిస్తూ ఖాతాదారుల సమాచారం ఇతరులు తెలుసుకునే విధంగా చేస్తోందని గుర్తించారు. దీనిపై ఆ బ్యాంకు వెంటనే స్పందించి, వినియోగదారులకు పంపిస్తున్న విండో ఎన్వలప్‌ల డిజైన్‌ను త్వరలో మారుస్తామని, ఇక ఎటువంటి సమాచారం బయటి వ్యక్తులకు కనిపించే వీలు ఉండకుండా చేస్తామని ఆర్‌బీఐకు తెలిపింది.