న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఫిరోజ్ షా కోట్లాలో టీంమిండియాతో జరుగుతున్న చివరి టెస్టు మూడోరోజు తొలి సెషన్లో లంకేయులు దూసుకెళ్తున్నారు. ఓవర్నైట్ స్కోరుతో ఆటను ఆరంభించిన జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆచితూచి అడుతున్నారు. బ్యాటింగ్ ప్రారంభించిన సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ 231 బంతుల్లో సెంచరీ సాధించాడు. సారథి దినేశ్ చండిమాల్ 191 బంతులకు గాను 61 పరుగులు చేసి అర్ధశతకం పూర్తి చేశాడు. ఇప్పటివరకు మొత్తం 212 పరుగులు చేసి 326 పరుగుల లోటుతో ఉన్నారు. వికెట్ తీసేందుకు భారత బౌలర్లు శ్రమిస్తున్నప్పటికి ఫీల్డింగ్ పొరపాట్లు మైదానంలో చోటు చేసుకున్నాయి.