న్యూఢిల్లీ, డిసెంబర్ 4: భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో మూడో రోజు శ్రీలంక ఆటను ఆరంభించింది. ఓవర్నైట్ స్కోరు 131/3తో ప్రారంభి౦చి దినేశ్ చండిమాల్ 124 బంతులకు 38 పరుగులు చేయగా, ఏంజెలో మాథ్యూస్ 158 బంతులకు గాను 70 పరుగులు చేశారు. మాథ్యూస్ ఆచితూచి ఆడుతూ సెంచరీ వైపు అడుగులు వేస్తున్నాడు. 58 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లను కోల్పోయి 158 పరుగులు చేసింది.