గన్ఫౌండ్రి, డిసెంబర్ 03 : రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులపై అమలు చేస్తున్న విధివిధానాలకు వ్యతిరేకంగా, ఈ నెల 5న బీసీ విద్యార్థుల మహాగర్జనను నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం తెలిపింది. ఈ మేరకు భాజపా కార్యాలయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సభలను చంపాపేటలోని మంద నర్సింహారెడ్డి గార్డెన్స్లో నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ సభకు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.