న్యూఢిల్లీ, డిసెంబర్ 3: భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్, కాలుష్యం కారణంగా నిలిపివేయాలని లంకేయులు పదే పదే ఆటకు అంతరాయం కలిగించారు. దీనిపై టీంమిండియా సారధి విరాట్ కోహ్లీ మండిపడ్డాడు. 127.5 ఓవర్లకు జట్టు స్కోరు 536/7 వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. అప్పటికే వృద్ధిమాన్ సాహా 19 బంతుల్లో 9 పరుగులు చేయగా, రవిచంద్రన్ అశ్విన్ 4 బంతుల్లో 5 పరుగులు చేశారు. లక్ష్య చేదనలో తొలి ఇన్నింగ్స్ ను అరంభించిన లంకేయులు ఆదిలోనే 2 వికెట్లను కోల్పోయారు. కరుణ రత్నే పరుగులు ఏమి చేయకుండా, డి సెల్వా ఒక్క పరుగుతో పెవిలియన్ కు చేరారు.