కాకినాడలో సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం

SMTV Desk 2017-12-02 16:46:02  cm chandrababu, BC protest, kakinada

కాకినాడ, డిసెంబర్ 02 : నేడు ఏపీ అసెంబ్లీలో కాపులను బీసీలో చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఆమోదం చేయడంపై తూర్పు గోదావరి జిల్లాలోని బీసీ సంఘాలు పెద్ద ఎత్తులో ఆందోళనకు దిగారు. దీంతో కాకినాడలోని కలెక్టరేట్‌ ఎదుట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అంతేకాకుండా టైర్లకు నిప్పు అంటించి రోడ్డుపై వేయడంతో కలెక్టరేట్‌ వైపు నుంచి వెళ్తున్న రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగింది. ఆందోళనకారులు ఆర్టీసీ బస్సుల టైర్లలో గాలి తీసేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, కాపులను బీసీల్లో చేర్చడం వల్ల వెనుకబడిన తరగతుల వర్గాల వారికి నష్టం జరుగుతుందని బీసీ సంఘాలు ఆరోపించాయి. బీసీల మెరుపు ముట్టడితో కలెక్టరేట్‌ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో బీసీ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.