బీసీలకు అదనంగా 5శాతం రిజర్వేషన్‌ :కేఈ కృష్ణమూర్తి

SMTV Desk 2017-12-02 15:57:04  assembly, BC, amaravathi, AP deputy CM KE Krishna Murthy

అమరావతి, డిసెంబర్ 02 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నేడు అసెంబ్లీలో కాపులను బీసీల్లో చేర్చే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల బీసీల ప్రయోజనాలు దెబ్బతినవని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్‌-9లో కాపులకు అదనంగా 5శాతం రిజర్వేషన్‌ కూడా కల్పిస్తామని కేఈ కృష్ణమూర్తి అన్నారు. అంతేకాకుండా వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు కేఈ మీడియాతో పేర్కొన్నారు. కాగా, కాపు రిజర్వేషన్‌ విద్య, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకే మాత్రమే పరిమితమవుతుందని ఆయన వెల్లడించారు.