ఇంగ్లాండ్, జూన్ 14 : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీ ఫైనల్లో పాకిస్థాన్ టాస్ గెలిచింది. పాక్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ కీలక బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. ఓపెనర్ బెయిర్ స్టో 43, హేల్స్ 13, రూట్ 46 పరుగలకు అవుటయిన విషయం తెలిసిందే. అనంతరం మోర్గాన్ 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కాగా కాసేపటికే బట్లర్ కూడా 4 పరుగుల వ్యక్తిగత స్కోరుకే వెనుదిరిగారు. దీంతో ఇంగ్లండ్ ఐదు వికెట్ల నష్టానికి 35 ఓవర్లలో 149 పరుగులతో క్రీజులో ఉంది. పాకిస్థాన్ బౌలర్లలో హాసన్కి రెండు వికెట్లు దక్కగా, రయీస్, జునైడ్, షాదాబ్లకు చెరో వికెట్ దక్కాయి. ప్రస్తుతం క్రీజులో సోక్స్ 8, అలీ 1 పరుగులతో ఉన్నారు.