న్యూఢిల్లీ, డిసెంబర్ 01: ఇటీవల మిస్ వరల్డ్ ఎంపికైన హర్యానా యువతి మానుషి చిల్లర్, టీమిండియా కెప్టెన్ కోహ్లీ ని ఒక ప్రశ్న అడిగారు. ఢిల్లీలో నిర్వహించిన సీఎన్ఎన్-న్యూస్ 18-2017 అవార్డుల కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ అవార్డు ప్రధానోత్సవంలో పాపులర్ ఛాయిస్ స్పెషల్ అఛీవ్మెంట్ పురస్కారాన్ని కోహ్లీ అందుకున్నారు.ఈ క్రమంలో విరాట్ ను చిల్లర్ ' అవార్డు తీసుకున్నందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు. ప్రస్తుతం మీరు ప్రపంచంలోనే ఆగ్రగామి బ్యాట్స్మెన్లలో ప్రధమ స్థానంలో కొనసాగుతున్నారు. ఎంతో మంది యువత మిమ్మల్ని స్పూర్తిగా తీసుకుంటున్నారు. ఆలాంటి వారికీ మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమిటి. ముఖ్యంగా చిన్నారులకు" అని ప్రశ్నించారు. దీనిపై విరాట్ తనదైన శైలిలో స్పందిస్తూ " మైదానంలో ఎప్పుడు, ఎం చేయాలి అనేది చాలా ముఖ్యం. ఆటలో మనమేంటో నిరూపించుకోవాలి. లేదంటే అభిమానుల మనసులను గెలుచుకోలేము. నేను ఎప్పుడు వేరొకరిలా ఉండాలని అనుకోను. నా పని సక్రమంగా చేయడమే నాకు తెలిసింది. దాన్నే నమ్ముతా. అదే యువతకు నేనిచ్చే సందేశం" అని వ్యాఖ్యానించారు.