పాదయాత్రలో కందిన రోజా పాదాలు...

SMTV Desk 2017-11-30 14:10:37  ycp MLA Roja, padayatra, facebook post viral.

నగరి, నవంబర్ 30 : వైకాపా ఎమ్మెల్యే, మహిళా నేత రోజా గాలేరు - నగరి ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేపట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా పాదయాత్ర చేస్తున్న ఆమె కాళ్ళకు బొబ్బలెక్కి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకున్నారు. ఆమె పోస్ట్ వైరల్ కావడంతో పలువురు సంఘీభావం తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది మీరు ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి మీకు ఆ భగవంతుడు అండగా ఉంటాడని సూచిస్తూ ఆమె ఫోటోలకు తెగ లైకులు కొడుతూ కామెంట్లు పెడుతున్నారు.