అమరావతి, నవంబర్ 29 : ఇటీవల పాడేరు వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెదేపాలో చేరగా, ఈ లోపే తాజాగా మరో వైకాపా నేత టీడీపీ చేరేందుకు సిద్ధమవుతున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన వైకాపా నేత గుర్నాథరెడ్డి తెదేపాలో చేరేందుకు రంగం ఆసక్తి చూపుతున్నారు. గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న గుర్నాథరెడ్డి తెదేపాలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఆయన తెదేపా కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో గుర్నాథరెడ్డి రాకను వ్యతిరేకిస్తున్న అనంతపురం జిల్లా నేతలను తెదేపా అధిష్టానం బుజ్జగించే పనిలో ఉంది.