మెట్రో ప్రయాణంలో సరికొత్త అనుభూతితో సెల్ఫీలు

SMTV Desk 2017-11-29 11:53:19  metro train, hyderabad, people

హైదరాబాద్, నవంబర్ 29 ‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మెట్రోరైలును మంగళవారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఉదయం నుంచి మెట్రోరైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన నగర వాసులు ఎట్టకేలకు ఈ మెట్రో ను ఎక్కేందుకు ఉత్సాహం కనబరిచారు. ఈ ఉదయం నుంచి అన్ని మెట్రోస్టేషన్లకు పెద్దయెత్తున చేరుకున్న ప్రజలు మెట్రోరైలు ఎక్కేందుకు ఆసక్తి చూపుతూ పోటీ పడ్డారు. తమ తొలి ప్రయాణ జ్ఞాపకాలను పదిలం చేసుకునేందుకు సెల్ఫీలు తీసుకుని మరి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, విద్యార్థులు ఇలా అన్ని రకాల వర్గాలు మెట్రో సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు సైతం మెట్రోలో ప్రయాణించి సరికొత్త అనుభూతులు ఆస్వాదించారు. నగరంలో రద్దీ కారణంగా దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డ ప్రజలు ఈ మెట్రో తో వీలైనంత త్వరగా గమ్యానికి చేరుకునేందుకు ఈ సేవలు బాగా ఉపయోగపడుతున్నాయన్నారు.