అమరావతి, నవంబర్ 28 : ఏపీ రాజధాని అమరావతిలో విట్ కళాశాల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ కళాశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. కృష్ణా జిల్లా ఐనవోలు గ్రామ పరిధిలో నిర్మించిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ అకడమిక్ బ్లాక్, దీనితో పాటు వసతి గృహం బ్లాకులను ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి ప్రారంభించారు. ఈ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖులతో పాటు కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.