జగన్‌ ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి: మంత్రి సోమిరెడ్డి

SMTV Desk 2017-11-26 16:49:04  Minister Somireddy Chandramohan Reddy, ys jagan,

విజయవాడ, నవంబర్ 26: ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రజాసంక‌ల్ప యాత్ర పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న పాదయాత్రపై మండిపడ్డారు. ఈ రోజు రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... " కొందరు రాజకీయ పార్టీల నాయకులు పాదయాత్రల పేరుతో రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ ప్రభుత్వం రైతుల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తోంది. త‌మ‌కు ఎన్ని ఆటంకాలు వ‌చ్చినా రైతు సంక్షేమాన్ని మాత్రం మ‌ర‌వ‌బోమ‌ని" అన్నారు. జగన్‌ తన పాదయాత్రలో నిజాలు మాట్లాడట్లేదు, ఇప్పటికైనా వాస్తవాలను చెప్పాలని తెలిపారు.