మోదీ రాకతో నగరంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

SMTV Desk 2017-11-25 14:04:47  Indian Prime Minister Narendra Modi, metro opening, GES Meeting, hyderabad

హైదరాబాద్, నవంబర్ 25 : ఈ నెల 28న మెట్రో రైల్ ప్రారంభోత్సవంతో పాటు జీఈఎస్ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయనున్నారు. దీంతో నగరంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రధాని బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో దిగి, అక్కడి నుంచి హెలికాప్టర్ లో మియాపూర్ వెళ్లనున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హెచ్‌ఐసీసీలో జరిగే జీఈఎస్‌ కు హాజరుకానున్నారు. మోదీ హాజరయ్యే ఈ సదస్సు చుట్టూ 4 కిలోమీటర్ల వరకు మనిషి చొరబడకుండా పోలీసులు భద్రత కల్పిస్తారు. అనంతరం ఫలక్‌ నుమా ప్యాలెస్, గోల్కొండ కోటల్లో జరిగే విందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ విందులో వివిధ రకాల వంటకాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాల్లోని నిఘా ఏర్పాటు చేశారు.