కర్నూల్, నవంబర్ 25: శుక్రవారం సీబీఐ కోర్ట్ కు హాజరైన జగన్ తిరిగి శనివారం పాదయాత్ర ప్రారంభించారు. ఈ ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి నుంచి ప్రారంభమయ్యింది. అక్కడి నుంచి చెరుకులపాడు, పుట్లూరు క్రాస్, తొగరచేడు క్రాస్ వద్దకు చేరుకుంటారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా కల్పిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగనున్నారు. భోజన విరామం అనంతరం కృష్ణగిరి నుంచి పాదయాత్ర పున:ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి 6.30గంటలకు రామకృష్ణ పురం చేరుకుంటారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత వైఎస్ జగన్ 16 రోజుల్లో 225.6 కిలోమీటర్లు నడిచారు.