అతివేగానికి ఒక కుటుంబం బలి...

SMTV Desk 2017-11-25 11:23:28  road accident, mahabubabad, thorrur,

మహబూబాబాద్, నవంబర్ 25: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని తొర్రూరు మండలం మాటేడు సమీపంలో ప్రయాణిస్తున్న కారు, లారీను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నెల్లికుదురు మండలం వావిలాలకి చెందిన నల్ల శ్రీనివాసరెడ్డి(40) కుటుంబం తొర్రూరు మండలం ఫత్తేపురం శివారులో ఉన్న ఓ వేడుకల మందిరంలో పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న శ్రీనివాసరెడ్డితోపాటు ఆయన భార్య మాధవి (32), తల్లి లక్ష్మి(55), పెద్ద కూతురు ప్రణీత(10) దుర్మరణం చెందారు. ఈ ప్రమాదానికి గల కారణం అతివేగమని పోలీసులు గుర్తించారు.