బ్రిస్బేన్, నవంబర్ 25 : బ్రిస్బేన్ వేదికగా ఆసీస్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్లో భాగంగా ఒక వింత సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ ఆరంభానికి కొద్ది రోజుల ముందు అటు ఇరు జట్ల క్రికెటర్లతో పాటు అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా వాదోపవాదాలు, చర్చలు జరగడంతో సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. గబ్బా స్టేడియం నిర్వహకులు ఒక వైపు స్టాండ్స్ తీసేసి, స్విమ్మింగ్ పూల్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంట్లో ఓ ప్రేమ జంట రొమాన్స్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశారు. తొలి టెస్టు రెండో రోజు ఆటలో లంచ్ విరామం తర్వాత ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్, క్రీజులోకి వస్తున్న సమయంలో ఈతకొలనులో ఉన్న తన ప్రియురాలికి ఆమె ప్రియుడు ప్రపోజ్ చేశాడు. ఇద్దరు పరస్పరం ముద్దులు పెట్టుకొంటూ, కాసేపు రొమాన్స్ చేశారు. ఇది చూసి కామెంటరీ బాక్స్లో ఉన్న వ్యాఖ్యాతలు సైతం మాట్లాడడం గమనార్హం.