హైదరాబాద్, నవంబర్ 24 : తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాల ప్రాతిపదికన మొత్తం 8,792 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి గత నెలలో టీఎస్పీఎస్సీ ఐదు నోటిఫికేషన్లను జారీ చేసింది. పాత జిల్లాల ప్రకారమే భర్తీ చేయాలంటూ కొందరు అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. నోటిఫికేషన్ సవరించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించడంతో, పాత జిల్లాల ప్రకారమే పరీక్ష నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేయాలని సూచించింది. ఈ దరఖాస్తుల స్వీకరణ గడువును డిసెంబర్ 15 వరకు పొడిగించాలని స్పష్టం చేసింది.