హైదరాబాద్, నవంబర్ 24 : ఇంత వరకు క్రికెట్ చరిత్రలో ఇలాంటి విజయం చూసి ఉండరు. ఒక బంతికే మ్యాచ్ గెలవడం ఎక్కడైనా చూశారా...? లేదా...? అయితే ఇది చదవండి... ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో బీసీసీఐ ఆధ్వర్యంలో అండర్-19 ఉమెన్స్ సూపర్ లీగ్లో సంచలన విజయం నమోదయ్యింది. టోర్నీలో భాగంగా శుక్రవారం నాగాలాండ్-కేరళ మధ్య 50 ఓవర్ల మ్యాచ్ నిర్వహించారు. టాస్ గెలిచిన నాగాలాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నాగాలాండ్ 17 ఓవర్లు ఆడి, కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. కేరళ బౌలర్లలో మిన్నూ మణి 4, సౌరభ్య 2, సంద్ర సురేన్, బిబీ సెబాస్టియన్ చెరో వికెట్ తీశారు. అనంతరం మూడు పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగుకు దిగిన కేరళ జట్టు ఒక్క బంతికే బౌండరీ కొట్టి, విజయాన్ని సొంతం చేసుకుంది.