అమరావతి, నవంబర్ 24: పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రహసనంగా మార్చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కె. పార్థసారథి ధ్వజమెత్తారు. పోలవరంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబు నటించిన నటనకు రెండు నంది అవార్డులు ఇవ్వాలని ఆయన అన్నారు. గతంలో 2018నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పారన్న సంగతి మర్చిపోరాదని ఆయన అన్నారు. ఇప్పుడేమో కేంద్రం సహకరిస్తేనే పోలవరం పూర్తి చేస్తామని కొత్త పల్లవి అందుకున్నారని దుయ్యబట్టారు. పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం సహకరించకపోతే ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నారని పార్థసారథి ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వస్తే పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసి దాని ఫలాలు ప్రజలకు అందిస్తామని ఆయన తెలిపారు.