హైదరాబాద్, నవంబర్ 24: చెల్లని చెక్కు కేసులో నిర్మాత బండ్ల గణేష్కు జైలు శిక్ష పడింది. ‘టెంపర్’ సినిమాకు సంబంధించి చెల్లని చెక్కు ఇచ్చారని రచయిత వక్కంతం వంశీ ఫిర్యాదు చేయగా, శుక్రవారం హైదరాబాద్లోని ఎర్రమంజిల్ కోర్టులో ఆ కేసు విచారణ జరిగింది. వాద ప్రతివాదనలు విన్న న్యాయమూర్తి.. బండ్ల గణేష్కు ఆర్నెల్ల జైలు శిక్షతో పాటు, రూ.15.86లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.