ఐటీ పార్క్ భవనంకు శంకుస్థాపన చేయనున్న లోకేష్

SMTV Desk 2017-11-23 16:33:08  IT Tower, naralokesh, vijayawada

విజయవాడ, నవంబర్ 23 : రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు పడనుంది. విజయవాడ కేంద్రంగా మరో ప్రతిష్టాత్మక ఐటీ టవర్ నిర్మాణానికి నేడు పునాది రాయి పడనుంది. గత ఏడాది వరకు ఖాళీగా ఉన్న మేథా టవర్స్‌ ప్రస్తుతం పూర్తిగా నిండిపోగా, రెండో పార్క్ నిర్మాణానికి ఐటీ శాఖమంత్రి నారాలోకేష్ చేతులమీదుగా శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమం కోసం ఎల్ఎంటీ సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ టవర్ ను అత్యంత వేగంగా సుందరంగా, ఐటీ కంపెనీలకు అనుకూలంగా ఉండేలా నిర్మించనున్నారు.