తిరుపతి, నవంబర్ 23 : గతంలో తిరుపతిలోని సీనియర్ సివిల్ జడ్జీగా పని చేసిన సదానందమూర్తి హఠాత్తుగా ఆత్మహత్య చేసుకున్నారు. రెండేళ్ల క్రితం తిరుపతిలో ఏఎస్ జే కోర్టు జడ్జీగా నియమిత్తులైన వీరు క్రమశిక్షణ పరమైన అంశాలపై ఆయనను ఏడాది కిందట సస్పెండ్ చేశారు. విద్యానగర్ లోని అద్దె ఇంట్లో ఈ నెల 22న ఫ్యానుకు ఉరేసుకున్నారు. రుయా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆయన స్వస్థలమైన కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం కు తరలించడం జరిగింది. సస్పెక్షన్ నేపథ్యంలో ఆయన అధికారిక నివాసాన్ని వదలడంతో తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు సమాచారం.