హైదరాబాద్, నవంబర్ 22 : గత కొంతకాలంగా మెట్రో ప్రారంభ తేదీని పొడిగిస్తూ చివరికి ఈ నెల 28న ఖరారు చేశారానుకునేలోపే మరో సందిగ్ధత కొనసాగుతోంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభించాలనుకున్న ఈ మెట్రోకు ఇంకా పీఎంవో నుంచి తమకేమీ సమాచారం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఎస్పీజీకి వచ్చిన వివరాలతోనే తాము మెట్రో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరయ్యేందుకు వస్తున్న ప్రధాని మోదీ మెట్రో రైలును ప్రారభించడంపై వెచ్చి చూడాల్సి ఉంది.