విజయవాడ, నవంబర్ 22: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా, నగరంలోని ఇండియా రైస్ కాంక్లేవ్ ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఇండియా రైస్ కాంక్లేవ్లో వరి సాగుపై శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనలు చేయనున్నారు. వరి సాగులో సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించనున్నారు. వరి అనుబంధ ఉత్పత్తుల తయారీపై ప్రధాన చర్చ జరగనుంది.