కరీంనగర్, నవంబర్ 21: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొనే సరికే వారు మృతి చెందినట్లు గుర్తించారు. తమ కుమారుడి పెళ్లి కార్డు ఇచ్చేందుకు హైదరాబాద్ వెళ్లి తిరిగి రామగుండం వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని కుటుంబీకులు తెలిపారు. నిద్రమత్తు వల్లే ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు.