కోలకతా, నవంబర్ 21 : టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పై, భారత్ జట్టు కోచ్ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించారు. ఈడెన్ వేదికగా శ్రీలంక తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో విరాట్, తనదైన శైలిలో శతకం సాధించి జట్టుని ఆదుకున్నాడు. ఈ సందర్భంగా " కోహ్లీ మహత్తరమైన ఆటగాడు. అతడికి ఆకాశామే హద్దు. అతణ్ని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది’ అని మ్యాచ్ ముగిసిన తర్వాత రవిశాస్త్రి అన్నారు. తొలి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో విరాట్ అంతర్జాతీయ కెరీర్ పరంగా 50వ సెంచరీ మైలురాయిని చేరుకున్నాడు. టీమిండియా మాజీ ఆటగాడు గంగూలీ కూడా కోహ్లీని సైతం ప్రత్యేకంగా అభినందించారు.