రాష్ట్రపతి పర్యటనపై చైనా అభ్యంతరం..

SMTV Desk 2017-11-20 16:19:05  President Ramnath Kovind, arunachal pradesh tour,

న్యూఢిల్లీ, నవంబర్ 20 : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్.. అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యటించడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కోవింద్ అక్కడ జరిపిన కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్నామని, అరుణాచల్‌ ప్రదేశ్‌గా పిలువబడే ప్రాంతాన్ని చైనా ఎప్పుడూ ధ్రువీకరించలేదని వ్యాఖ్యానించింది. అయితే ఇటీవల రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనపై కూడా చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం విదితమే.