విపక్ష నేత జగన్ చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న వాగ్దానాలు అధికార తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగానే మారుతున్న ట్లుగా ఉంది. పౌరసరఫరాల మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జగన్ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి హామీలు ఇచ్చినా జగన్ అధికారంలోకి రాలేరని ఆయన జోస్యం చెప్పారు. జగన్ వాగ్దానాలు నీటి మీద రాతలని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉండదని పుల్లారావు అన్నారు.