హైదరాబాద్, నవంబర్ 19 : మెట్రో రైలు ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతుండడంతో ఎల్అండ్టీ, హెచ్ఎమ్ఆర్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పలు చోట్ల పనులు చివరి దశలో ఉండగా మరికొన్ని చోట్ల పనులే మొదలు కాలేదు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగగుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకు౦టున్నారు. ఏదైనా లోపం తలెత్తుతుందేమో అని ఒకటికి పదిసార్లు తనిఖీలు చేపడుతున్నారు. ఓ వైపు సమయం దగ్గరపడడం.. ఇటు చూస్తే పనులు పూర్తి కాకపోవడంతో అధికారులలో ఆందోళన నెలకొంది.