గద్వాల్, నవంబర్ 19 : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ పార్టీ మహిళా నేత డీకే అరుణ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. గద్వాల్లో ఆదివారం మీడియాతో డీకే అరుణ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్కు కొవ్వు ఎక్కువై కొట్టుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదన్నారు. అసలు కేసీఆర్ పుట్టిందే కాంగ్రెస్ పార్టీలో అని అరుణ గుర్తుచేశారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కేసీఆర్ను, కేటీఆర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు పాతాళంలోకి తొక్కేస్తారని డీకే అరుణ దుయ్యబట్టారు.