ట్విట్టర్‌ ఖాతాలో విపక్షాలపై తేజస్వీ యాదవ్‌ కామెంట్స్‌

SMTV Desk 2017-11-19 14:58:17  RJD Tejasvi Yadav, Congress vice president Rahul Gandhi, lunch meeting viral, restaurant

న్యూఢిల్లీ, నవంబర్ 19 : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కలిసి భోజనం చేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తేజస్వి, రాహుల్‌ శుక్రవారం ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తూ, పలు రాజకీయ విషయాల గురించి చర్చించుకున్నట్లు సమాచారం. ఈ ఫొటోలను తేజస్వి తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఇలా ఇద్దరు నేతలు కలవడం విపక్షాలకు నచ్చలేదు. వెంటనే దీనిపై విపక్షాలు ఇరు పార్టీలపై విమర్శలు కురిపించారు. దీనిపై తేజస్వి ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ... ‘మేమిద్దం లంచ్‌ చేస్తే వేరే వారికి అరగడంలేదని ఘాటుగా బదులిచ్చారు. అలాగే, తన కోసం పనులు వదులుకుని మరి లంచ్‌కి వచ్చినందుకు రాహుల్ కు ధన్యవాదాలు తెలిపారు.