కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన వరంగల్ లో చేనేత మిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని విదాల తెలంగాణ అబివృద్దిని అడ్డుకుంటోందని, దానిని వచ్చే ఎన్నికలలో పాతాళంలోకి తొక్కాలని అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని ఆయన అన్నారు. ప్రజలకే గాని, తాము పసలేని దద్దమ్మలకు జవాబుచెప్పబోమని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు, టిఆర్ఎస్ పాల్గొందని ,అందువల్లే తెలంగాణ సాధ్యమైందని ఆయన అన్నారు.