హైదరాబాద్, నవంబర్ 19 : వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ పై సంచలన కామెంట్స్ చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచాడు. గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్స్ సమిట్ (జీఈఎస్) సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ రానున్న ఇవాంకాను ఉద్దేశించి ఫేస్బుక్లో కామెంట్స్ చేశాడు. "నాకు రాజకీయాలపై ఎలాంటి అవగాహన లేదు. అసలు ఇవాంకా హైదరాబాద్లో ఎందుకు పర్యటించాలనుకుంటోందో నాకు అర్థం కావడం లేదు. కానీ నేను మాత్రం ఆమె అందాన్ని చూడాలని ఎంతగానో ఎదురుచూస్తున్నాను. గతంలో సన్నీలియోని భారత్ వచ్చినప్పుడు కూడా నేను ఇలాగే చాలా థ్రిల్లయ్యాను" అని పేర్కొన్నారు. కాగా ఇవాంకా రాక కోసం నగరంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.