గచ్చిబౌలి-శంషాబాద్‌ వద్ద ప్రమాదంతో ఓఆర్‌ఆర్‌పై ట్రాఫిక్‌ కు అంతరాయం...

SMTV Desk 2017-11-19 10:44:15  Shamshabad, track, accident, traffic

హైదరాబాద్, నవంబర్ 19 ‌: శంషాబాద్‌ మీదుగా వెళ్లుతున్న ట్రక్‌ అదుపు తప్పడంతో, వాహనాలను ఢీకొట్టి ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే...రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడ సమీపంలోని ఔటర్‌ రింగ్‌రోడ్‌ గుండా వెళ్లుతున్న ట్రక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని, రెండు కార్లను ఢీ కొనడంతో, నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న శంషాబాద్‌ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి, అనంతరం రహదారికి అడ్డంగా పడివున్న వాహనాలను క్రేన్‌ సాయంతో తొలగించారు. ఈ ప్రమాదంతో గచ్చిబౌలి-శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహనదారులకు ఇబ్బందులు చోటుచేసుకుంటున్నాయి.