హైదరాబాద్, నవంబర్ 18: శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఈరోజు ఉదయం కారు దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి విమానాశ్రయానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. దీంతో ఆ వ్యక్తి వెంటనే కారు దిగి దూరంగా వెళ్లాడు. సమాచారం అందుకున్న విమానాశ్రయ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.