హైదరాబాద్, నవంబర్ 18: సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఇంట్లో చోరి జరిగింది. బంజారా హిల్స్ లోని ఎమ్మెల్యే కాలనిలో ఆయన ఇంటి లో భారీగా బంగారు ఆభరణాలు చోరి అయ్యాయి. కానీ వాటి విలువ ఇంకా తెలియాల్సి వుంది. బంగారు ఆభరణాలు చోరి అయినట్లు కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు తెలిపారు. ఇంటిలో పనిచేసేవారే ఎవరైనా ఈ చోరి కి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు అక్కడకు వెళ్లి వివరాలు తీసుకున్నారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం లక్ష్మి నారాయణ మహారాష్ట్ర అదనపు డీజీపీ గా పనిచేస్తున్నారు.