హైదరాబాద్, నవంబర్ 18: మంత్రి కేటీఆర్ ఈ రోజు వరంగల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రూ.101 కోట్లతో నగరాభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ తరువాత తెలంగాణ ప్రభుత్వం వరంగల్ ను అన్నివిధాల అభివృద్ధి చేయాలని భావిస్తుందని, అందులో భాగంగానే ఈ మధ్య సీఎ౦ కేసీఆర్ చేతుల మీదుగా వరంగల్ లో టెక్స్టైల్ పార్క్ కు శంకుస్థాపన జరిగి౦దని టిఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.