హైదరాబాద్, నవంబర్ 17: ఓ విద్యార్ధి హాజరు శాతం తక్కువ ఉందంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... మేడ్చల్ జిల్లా నాగారానికి చెందిన నాగేందర్ రెడ్డి, కవిత రెండో కుమారుడు అభిషేక్ రెడ్డి(20) ఘట్కేసర్లోని విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. హాజరు శాతం తక్కువ ఉండటంతో కళాశాల ప్రిన్సిపాల్, అభిషేక్ రెడ్డికి డిటెన్షన్ ఇచ్చారు. దీంతో మనస్థాపానికి గురైన అభిషేక్, సికింద్రాబాద్ సమీపంలోని ఆలుగడ్డ బావి ప్రాంతంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని చూసిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే జీఆర్పీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, మృతుడి వద్ద లభ్యమైన గుర్తింపు కార్డు ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.