అమరావతి చేరుకున్నసింగపూర్ మంత్రి...

SMTV Desk 2017-11-17 11:09:05  p.eswaran, amaravathi, singhapore minister, ap cm chandra babu naidu

అమరావతి, నవంబర్ 17 : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్ ఈ ఉదయం చేరుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈశ్వరన్ కు ఘన స్వాగతం పలికారు. నూతనంగా నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీని సీఎం ఆయనకు చూపించారు. ఈ సందర్భంగా ఈశ్వరన్ మాట్లాడుతూ... అతి తక్కువ సమయంలోనే చాలా అందంగా, అద్భుతంగా రాజధానిని నిర్మించారని కొనియాడారు. అనంతరం అమరావతిలో సింగపూర్ సంస్థలు చేపట్టబోయే ప్రాజెక్టులపై వీరిద్దరూ చర్చించారు. ముఖ్యంగా శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం తదితర నిర్మాణాలపై చర్చలు జరిపారని సమాచారం.