సముద్రపు గర్బంలోకి చేరుకోబోతున్న నాసా బృందం

SMTV Desk 2017-06-11 18:51:44  NASA,Research,Mars Planet,NEEMO

వాషింగ్టన్, జూన్ 11: నాసా(నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) పరిశోధనలో భాగంగా నలుగురు సభ్యుల బృందాన్ని 10 రోజుల పాటు అట్లాంటిక్ మహాసముద్రం అడుగుకు పంపించాలని భావిస్తుంది. ఈ పరిశోధన ద్వారా అంతరిక్షంలో అంగారక గ్రహంపై ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంచనా వేసి, భవిష్యత్తులో చేపట్టబోయే అంతరిక్ష కార్యక్రమాలకు సిద్దం అవుతుంది. ఈ కార్యక్రమానికి నీమో (నాసా ఎక్స్ ట్రీం ఎన్విరాన్ మెంట్ మిషన్ ఆపరేషన్స్)-22 అని నామకరణం చేశారు. సముద్రం అడుగున గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుందనీ, అక్కడ ఉంటే సుమారు అంతరిక్షంలో ఉన్నట్లేనని దక్షిణ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు. అంతరిక్షంలోలాగే సముద్రం అడుగున నడవడం వంటివి బృందంలోని సభ్యులు అభ్యాసం చేయనున్నారు. భవిష్యత్తులో అంతరిక్ష కార్యక్రమాలలో అనుసరించే విధానాలు, సాధనాలను ఇక్కడ పరీక్షించబోతున్నారు. జూన్ 18 న ఈ బృందం సముద్రం అడుగుకు వెళ్తుంది.