అమరావతి, నవంబర్ 16 : మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీలో చేరనున్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కొద్దిరోజుల నుండి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అమర్నాథ్ రెడ్డి కూడా తెలుగుదేశంలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కిషోర్ భేటీ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లో చేరవచ్చని ప్రచారం సాగింది. కాని ఈ పుకార్లన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ.. ఆయన సోదరుడు కిషోర్ టీడీపీలో చేరుతుండడం విశేషం.